దేశంలోని రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడంపై కీలక ప్రకటన చేసింది. ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమ 20వ విడత రూ. 2,000 జూన్ 20న ప్రధాని మోదీ బీహార్ పర్యటన సందర్భంగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

దీనిని సజావుగా స్వీకరించేందుకు రైతులు ఈ-కేవైసీని పూర్తి చేసి భూరికార్డులు ధ్రువీకరించాలి. ఆలస్య నివారణకు పీఎం కిసాన్ పోర్టల్ లో లబ్ధిదారుల స్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఈ చెల్లింపు నుంచి 29.88 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందుతారని సమాచారం అందుతుంది. దీంతో దేశంలోని రైతులు సంతోష పడుతున్నారు.