మంచి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పథకంలో పొదుపు చేయండి..1

-

సంపాదించడంతో పాటుగా ఆదా చేయడం కూడా ఎంతో అవసరం. చాలా శాతం మంది ఎంతో సంపాదించినా సరే పొదుపు చేయకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగులు పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గాలను వెతుకుతూ ఉంటారు, కాకపోతే సురక్షితం కాదని భయపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ లో పెట్టుబడి చేయవచ్చు. దీనిలో ప్రతి నెల 3000 రూపాయల వరకు పొదుపు చేయడం వలన 24 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. సహజంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను తీసుకురావడం జరుగుతుంది. అయితే వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి.

దీనిలో గ్యారంటీ రాబడులు ఉంటాయని తెలియజేస్తోంది. ముఖ్యంగా పిపిఎఫ్ ఖాతా కేంద్ర ప్రభుత్వం నడపడం వలన దీంట్లో సురక్షితమైన రాబడులు ఉంటాయి మరియు దీనిలో పెట్టుబడి చేయడం వలన పని నుండి కూడా మినహాయింపు పొందవచ్చు. అయితే, దీనిని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే రిటైర్మెంట్‌ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండాలనుకుంటే, కచ్చితంగా ఇటువంటి పథకాలలో పెట్టుబడి చేయాల్సిందే.

పిపిఎఫ్‌ కు సంబంధించిన మెచ్యూరిటీ 15 సంవత్సరాలు మరియు దీన్ని 500 చొప్పున మరో రెండుసార్లు కొనసాగించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఈ విధంగా పిపిఎఫ్ ఖాతాను 25 ఏళ్ల వరకు కొనసాగించుకోవచ్చు. ఎప్పుడైతే ఇటువంటి పథకాలలో పెట్టుబడి చేస్తారో, భవిష్యత్తులో సురక్షితమైన రాబడి ఉండడం వలన ఆదాయం లేకపోయినా సరే ఆర్థికంగా బలంగా ఉంటారు. పైగా దీనిలో ఎటువంటి రిస్క్ లేకపోవడం వలన పెట్టుబడి చేయవచ్చు. కనుక మీ ఆదాయంలో కొంత శాతం ఇటువంటి పథకాలలో పెట్టుబడి చేయవచ్చు మరియు వడ్డీ ని కూడా పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news