కుప్పంలో మరో ఘటన తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మహిళపై టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది. మహిళ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, మహిళను బెదిరిస్తున్నాడట టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ భూమిని ఆక్రమించాడట టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు. అదే గ్రామంలో 20 ఏళ్ల నుండి 2.72 ఎకరాల భూమి తన పేరుమీదే ఉందని, ఆ భూమిపైన లోన్ కూడా తీసుకున్నామని పేర్కొంది మహిళ.
కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు, తమ భూమిని వేరే వ్యక్తుల పేరున ఉన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు మహిళ. ఎంత మంది అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అధికారులంతా టీడీపీ నాయకులు చెప్పినట్టే వింటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ… టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు నుండి తమ భూమి కాపాడాలని, తమ కుటుంబానికి ఏమన్నా జరిగితే టీడీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెబుతున్నారు.
కుప్పంలో మరో ఘటన
చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మహిళపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
మహిళ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, మహిళను బెదిరిస్తున్న టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి అనే… pic.twitter.com/ENBEvXQnhO
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025