ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పుష్ప 2 సినిమాలోని రఫా… రఫా సినిమా డైలాగ్ చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ డైలాగ్ కొట్టడంతో.. టిడిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి లీడర్ వరకు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే… వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఏపీలో లేకుండా చేస్తామని… కనబడకుండా పోతాడని ఏపీ మంత్రి కింజారపు అచ్చం నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఉన్న టిడిపి పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారని గుర్తు చేశారు. మేము ఒక్క పిలుపు ఇస్తే మీ పార్టీ అలాగే మీరు ఎక్కడ కనబడకుండా పోతారని వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని చేతకాని వాళ్లు అనుకుంటే ఖబర్దార్ అంటూ… జగన్మోహన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.