కడపలో హై టెన్షన్ నెలకొంది. నేడు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. దింతో కడప కార్పొరేషన్ లో ఉత్కంఠ నెలకొంది. కార్పోరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. కార్పొరేషన్ కార్యాలయం చుట్టు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అనర్హత వేటుపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని సమావేశం నిర్వహిస్తున్నారు మేయర్. ఎక్స్ అఫీషియో హోదాలో సర్వసభ్య సమావేశానికి రానున్నారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి.

నిబంధనలకు విరుద్ధంగా మేయర్ కుర్చీ పక్కనే ఎట్టకేలకు తనకూ కుర్చీ వేయించుకున్నారట ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఏడాదిగా మేయర్కు సమానంగా వేదికపై తనకూ కుర్చీ కావాలని పట్టుపట్టిన ఎమ్మెల్యే… నిబంధనల ప్రకారం ఎక్స్ఆఫిషియో సభ్యులు కార్పొరేటర్లతో పాటే కూర్చోవాలని స్పష్టం చేస్తున్నారు. అయినా నిబంధనలను అతిక్రమించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేశారు.