తిరుమల శ్రీవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుమల శ్రీవారిని రోజుకు లక్ష మందికి పైగా… దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉండి ఆదాయం కూడా మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు నమోదు అవుతుంది. నిత్యం తిరుమలలో ఈ మధ్యకాలంలో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల తిరుపతి శ్రీవారి క్యూలైన్లో ఫ్యాన్లు పనిచేయడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గాలి రాక క్యూ లైన్ లో గంటల తరబడి భక్తులు ఉన్నప్పటికీ… ఫ్యాన్లు వేయడం లేదని మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంపై టిటిడి అధికారులు ఆరాధిస్తున్నారు. భక్తుల ఇబ్బందులపై కూడా చర్చ జరుగుతుంది. ఇక తిరుమల భక్తుల కోసం ఫ్యాన్లు వేయకపోవడం పై వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి క్యూ లైన్లో ఫ్యాన్లు పనిచేయక భక్తుల ఇక్కట్లు
గాలి రాక క్యూ లైన్లో గంటల తరబడి ఇబ్బంది పడుతున్న భక్తులు pic.twitter.com/WjRNsy9ZJe
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025