ఆంధ్రప్రదేశ్లోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నారు. పీఎం కిసాన్ యోజన రూ. 2 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 వేలు అందించనున్నారు. అయితే జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తారని సమాచారం అందుతుంది.

అయితే జూన్ నెల చివరిలో పీఎం కిసాన్ యోజన 20వ తేదీ ఇన్స్టాల్మెంట్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారని సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా…. ఆటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 చొప్పున డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ నిధులను అందజేస్తున్నారు.