ఫోన్ ట్యాపింగ్ లో కేసులో ఇవాళ కీలకపరిణామం పరిణామం చోటు చేసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేయనుంది సిట్. ఇక ఇవాళ సిట్ ముందు హాజరుకానున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావును పలుమార్లు ప్రశ్నించింది సిట్. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.