హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. చాకలి ఐలమ్మ మునిమనవరాలు హత్యకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి. జీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలుగా గుర్తించారు. 8 నెలల క్రితమే నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో చాకలి ఐలమ్మ మునిమనవరాలు అంజలి కూతురుకు పరిచయం ఏర్పడింది.
పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించింది తల్లి అంజలి. వారం క్రితం శివతో వెళ్లిపోయింది బాలిక. మూడు రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చింది బాలిక. చాకలి ఐలమ్మ మునిమనవరాలు అంజలిని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. నిన్న సాయంత్రం నల్గొండ నుంచి వచ్చాడు ప్రియుడు శివ. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేసి బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పాడు శివ. సుత్తితో తల్లి తలపై కొట్టింది కూతురు. ఆ తరువాత శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో పీక కోసింది.