ఫోన్ ట్యాపింగ్ పై బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో ఆయన సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో సమావేశమయ్యారు. నా ఫోన్ అనేకసార్లు ట్యాప్ చేశారు. నేను నా భార్య మాట్లాడుకునే సంభాషణలు కూడా ట్యాప్ చేసి విన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తన ఇష్టానికి పనిచేసేవారిని తనకు నచ్చిన విధంగా ఉన్నత స్థాయిలో నియమించుకున్నారు.

నా ఫోన్ ట్యాపింగ్ వెనక ఎవరు ఉన్నా ప్రభుత్వం తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. ఎవరైనా సరే వదిలి పెట్టేది లేదని సీరియస్ అయ్యారు.నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు… 2018లోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారని పేర్కొన్నారు. దేశద్రోహులు, టెర్రరిస్టులపై నిఘా పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారన్నారు దీనిపై BRS ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి.
ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు
2018లోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారు
2021లో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో… pic.twitter.com/uBYk0NdI8r
— BIG TV Breaking News (@bigtvtelugu) June 24, 2025