ఆరోగ్యకరమైన పండ్లను పెరుగుతో కలిపి తీసుకుంటే పొరపాటే..!

-

పూర్తి ఆరోగ్యం బాగుండాలని ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుని మంచి జీవన విధానాన్ని అందరు పాటిస్తూ ఉంటారు. కాకపోతే ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా తెలియకుండానే ఎన్నో తప్పులను చేయడం సహజం. ముఖ్యంగా వాటిలో పండ్లు మరియు పెరుగుని జోడించి తినడం. ఈ విధంగా పెరుగు మరియు పండ్లను కలిపి తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. పైగా ఇది ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ట్రెండీ బ్రేక్ఫాస్ట్ బౌల్స్, స్మూతీలు వంటివి తరచుగా కనిపిస్తూ ఉన్నాయి.

అటువంటి వాటిలో పెరుగు లేక యోగర్ట్‌తో కలిపి పండ్లను తీసుకుంటున్నారు. పెరుగు మరియు పండ్లు ఎంతో ఆరోగ్యకరం, కాకపోతే వాటిని జోడించి తీసుకోవడం వలన జీర్ణ ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్రేక్‌ఫాస్ట్‌ లో భాగంగా పెరుగుని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. పైగా శరీరంలో వేడిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా పండ్లలో ఉండే ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు సహజ చక్కెరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే వీటిని కలిపి తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పై ప్రభావం ఉంటుంది.

కనుక పెరుగును పండ్లతో కలిపి తీసుకోకపోవడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటు సూక్ష్మజీవుల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రోబయోటిక్స్ ఉండే పెరుగుని మరియు సహజ చక్కెరలు ఉండే పండ్లను కలిపి తీసుకుంటారో, సూక్ష్మజీవులకు అవి పోషకాలుగా అందుతాయి. దీనివలన దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడైతే పండ్లు మరియు పెరుగుని కలిపి తీసుకుంటారో, అవి జీర్ణ అగ్నికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ విధంగా కడుపు ఉబ్బరం, చర్మ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక పండ్లు లేక పెరుగును తీసుకోవాలంటే కనీసం 30 నిమిషాల వ్యవధిలో తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news