బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై.. గత కొన్ని రోజులుగా తప్పుడు కథనాలు రాస్తున్నారని, ప్రసారం చేస్తున్నారని గులాబీ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈ తరుణంలోనే మహా టీవీ ఆఫీస్ పై గులాబీ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహా న్యూస్ ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చున్నారు గులాబీ పార్టీ నేతలు.

అయితే… వాళ్లపై మహా న్యూస్ సిబ్బంది కాస్త ఓవర్గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో.. మహా న్యూస్ ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేశారు గులాబీ పార్టీ నేతలు. అలాగే రెండు కార్లను.. కూడా ధ్వంసం చేశారు. ఫోన్ టాపింగ్ అంశంలో… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ… గులాబీ పార్టీ నేతలు రెచ్చిపోయారు. అయితే ఈ సంఘటనపై.. మహా న్యూస్ చీఫ్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్వీ కార్యకర్తలపై మహా న్యూస్ యాజమాన్యం దాడి
దాడిలో గాయపడిన బీఆర్ఎస్వీ నాయకులు https://t.co/JIrQdsZEZd pic.twitter.com/1WGvF88wA6
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2025