ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 20 అలాగే 21వ తేదీలలో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అదే రోజున యోగా దినోత్సవం వచ్చింది. దీంతో 20 అలాగే 21వ తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. అయితే వాయిదా వేసిన పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జూలై 1 అలాగే జూలై రెండవ తేదీలలో… ఈ పరీక్ష లను నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త హాల్ టికెట్లు ఐదవ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలు అలాగే తేదీలలో సరిచూసుకోవాలని.. వెంకట కృష్ణా రెడ్డి సూచనలు చేశారు. ఏవైనా పొరపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా కోరారు.