తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఉపరితలావర్తనం కారణంగా వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.

ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల నిజామాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి మహబూబాబాద్ సిరిసిల్ల వరంగల్ హనుమకొండ, జగిత్యాల లాంటి జిల్లాలో బలమైన ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం పొంచి ఉన్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.