తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.40 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసు నేపథ్యంలో తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై-మాధవరంలోని తిరుమల డెయిరీలో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు ఏపీ-విశాఖపట్నానికి చెందిన నవీన్ బొలినేని(37). తిరుమల మిల్క్ డెయిరీలో రూ.40 కోట్ల మేర మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు పోలీసులు. ఈ క్రమంలో విచారణకు హాజరు కాకుండానే చెన్నై-బ్రిటానియానగర్లోని తనకు చెందిన షెడ్లో ఉరి వేసుకుని నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరెస్ట్ భయంతోనే నవీన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తల్లికి, స్నేహితులకు, బంధువులకు నవీన్ ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం అందుతోంది.