BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు అయింది. తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేసు నమోదు చేశారు మేడిపల్లి పోలీసులు. కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంపై, తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.

సుమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారన్నారు తీన్మార్ మల్లన్న. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్న మల్లన్న… ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారు. దింతో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేసు నమోదు చేశారు మేడిపల్లి పోలీసులు.