వరంగల్ లో భారీ వర్షం..డిపోలకే పరిమితమైన బస్సులు

-

భారీ వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. దింతో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. కాశీబుగ్గ, రంగశాయిపేట, కరీమాబాద్ లాంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతుకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో షాపులు, ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దింతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

warangal rain
Warangal city flooded due to heavy rain

గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యావరేజ్‌గా 92.9 మి.మీగా వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా సంగెంలో 202.4 మి.మీ గా నమోదవ్వగా, ఖిలా వరంగల్ ప్రాంతంలో 148.5 మి.మీ, వర్ధన్నపేటలో 93.3 మి.మీ, పర్వతగిరిలో 107.5 మి.మీగా నమోదు అయింది వర్షపాతం.

Read more RELATED
Recommended to you

Latest news