గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. సురేంద్రనగర్ జిల్లాలో నిన్న(ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన చౌ చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

దేదాదర గ్రామ సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారు, టాటా హారియర్ ఎస్యూవీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో డిజైర్ వాహనంలో ఉన్న ప్రయాణికులంతా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. సమీప ఆస్పత్రుల్లో గాయపడిన ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు.