నేడు విజయవాడ, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. ఇందులో భాగంగానే…. ఈ ఉదయం 10 గంటలకు విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ లో నిర్వహించే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్ లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ పై ప్రసంగం ఉండనుంది.

ఈ సమావేశం అనంతరం తిరిగి అమరావతికి రానున్నారు చంద్రబాబు నాయుడు. ఇవాళ సా.6 గంటలకు విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉత్తమ పని తీరు కనబరిచిన 175 మంది టీచర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు చంద్రబాబు నాయుడు.