రోడ్డు ప్రమాదంలో ఆర్థిక శాఖ అధికారి నవజోత్ మృతి

-

ఢిల్లీలో తీవ్ర విషాదం చోఓటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి నవజోత్ మృతి చెందాడు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది ఓ BMW వాహనం. బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Finance Ministry official Navjot dies in road accident
Finance Ministry official Navjot dies in road accident

వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నవజోత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు.
భార్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు.. BMW వాహనంలో ప్రయాణిస్తున్న జంటకు కూడా ఈ ఘటనలో గాయాలు అయిన‌ట్లు చెబుతున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news