తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా ఓ ట్రంప్ ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన సాగించే వారు ఎవరైనా సరే ట్రంప్ అవుతారని వెల్లడించారు. రాత్రి కలలో అనుకుంటే, ట్రంప్ పగలు అమలు చేస్తాడని ఫైర్ అయ్యారు.

ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్ ని పక్కన పెట్టారని వివరించారు. పాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరం అన్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికాకు నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. అమెరికా వద్దన్న సంస్థలన్నీ ఇండియాకు రావాలని… ఆ సంస్థలను తెలంగాణకు ఆహ్వానిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.