మీడియా రంగంలో కుదుపు: వాషింగ్టన్ పోస్టు లేఆఫ్స్‌లో శశిథరూర్ కుమారుడికీ దెబ్బ

-

ప్రపంచ ప్రసిద్ధ పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’లో భారీగా లేఆఫ్స్ మొదలయ్యాయి. ఈ వేటుకు సామాన్యులే కాదు, రాజకీయ దిగ్గజం శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కూడా గురయ్యారు. “ఇది నాకు చాలా చెడ్డ రోజు” అంటూ ఆయన తన బాధను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఎంతటి ధనవంతులైనా, పేరున్న వారైనా.. కష్టపడి చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఈ వార్త విన్నప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటనే ఆలోచన రాకమానదు. వివరాలలోకి వెళితే..

వాషింగ్టన్ పోస్ట్‌లో ఏం జరిగింది?: ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందులో భాగంగానే పదేళ్లుగా అక్కడ విదేశీ వ్యవహారాల కాలమిస్టుగా పనిచేస్తున్న ఇషాన్ థరూర్‌పై కూడా వేటు పడింది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా తనను తీసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం టెక్ కంపెనీలే కాదు ఇప్పుడు మీడియా సంస్థలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని ఈ ఘటన నిరూపిస్తోంది.

Media Industry Shaken: Shashi Tharoor’s Son Hit by Washington Post Layoffs
Media Industry Shaken: Shashi Tharoor’s Son Hit by Washington Post Layoffs

హోదా ఏదైనా గుండెకోత ఒక్కటే: సాధారణంగా శశిథరూర్ వంటి ప్రముఖుల కుటుంబం అంటే వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ, ఒక ప్రొఫెషనల్ పర్సన్‌గా తాను నమ్ముకున్న వృత్తిలో గుర్తింపు కోల్పోవడం అనేది మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. హోదా, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే ఇంతలా స్పందిస్తున్నారంటే.. అసలు ఎటువంటి ఆసరా లేని ఉద్యోగి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవాలి.

ఒక సాధారణ ఐటీ ఉద్యోగి లేదా మీడియా ప్రతినిధి ఉద్యోగం కోల్పోతే ఆ ఇంట్లో చాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక  ధనవంతులకు మరో అవకాశం వెతుక్కునే సమయం, ధైర్యం ఉంటాయి. కానీ, అక్కడ కొన్ని ఏళ్ళు పనిచేసి,ఒక్కసారిగా బయటకు వెళ్ళమంటే, కొంత భాద ఉంటుంది. ఇక ఇషాన్ థరూర్ తన బాధను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

సంస్థలు లాభాల కోసం లేఆఫ్స్ చేయవచ్చు, కానీ ఆ నిర్ణయం వెనుక వేల కుటుంబాల భవిష్యత్తు ఉంటుందని మరవకూడదు. ఈ కష్టకాలంలో నిరుద్యోగులకు సామాజిక మద్దతు అవసరం. ఎవరైనా ఉద్యోగం కోల్పోతే వారిని తక్కువ చేసి చూడకుండా వారికి అండగా నిలవడమే మన బాధ్యత.

Read more RELATED
Recommended to you

Latest news