తిత్లీ బాధితుల కోసం బన్ని విరాళం

-

శ్రీకాకులం జిల్లాలో తిత్లీ తుఫాను వల్ల భారీ ఆస్తి నష్టం జరిగిందని తెలిసిందే. తుఫాను వల్ల 2400 కోట్ల దాకా నష్టం జరిగిందని తెలుస్తుంది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం సహాయక చర్యలు మొదలు పెట్టగా సిని సెలబ్రిటీస్ కూడా తమ వంతు సాయంగా ఏపికి అండగా ఉంటున్నారు. తిత్లీ తుఫాను బాధితులకు సహయార్ధంగా బాలకృష్ణ 25 లక్షలు, ఎన్.టి.ఆర్ 15 లక్షలు, కళ్యాణ్ రాం 5 లక్షలు, విజయ్ దేవరకొంద 5 లక్షలు, వరుణ్ తేజ్ 5 లక్షలు విరాళాలు ఇచ్చారు.

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కూడా 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఇక వీరితో పాటుగా లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూడా పాతిక లక్షల విరాళం ప్రకటించడం జరిగింది. సిఎం రిలీఫ్ ఫండ్ కు బన్ని ఆ మొత్తాన్ని పంపించారట. ఆపద ఏదైనా మీకోసం మేమున్నా అంటూ ముందుకొస్తున్నారు సిని సెలబ్రిటీస్. ఇక తిత్లీ కోసం మిగిలిన స్టార్స్ నుండి ఇంకా స్పందన రాలేదు. మహేష్, ప్రభాస్, రాం చరణ్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఈ విషయంపై స్పందించే అవకాశం లేకుండా పోయింది. షూటింగ్ కంప్లీట్ చేశాక వీరు రెస్పాండ్ అవుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news