నేరేడు సాగులో రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్షల్లో ఆదాయం..

-

ఈ సీజన్ లో ఎక్కువగా మామిడి పండ్లతో పాటు నేరేడు కూడా ఎక్కువ దర్శనమిస్తాయి.ఈ నేరేడు సాగులో కొన్ని మెలుకువలు తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం…

మన తెలుగు రాష్ట్రాల లో ఎక్కువగా అనంతపురం లో సాగు చేస్తున్నారు.రెండు ఎకరాలలో 100 చెట్లకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నారు..తూర్పుగోదావరిలోని కడియం గ్రామానికి చెందిన నేరేడు తోటలు నాటేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ వారు సహకరించారని చెప్పారు. కడియం నుంచి 160మొక్కలను కొన్నాడు. అవి 2019 నుంచి నేరేడు పళ్ళు కాస్తున్నాయి. 2 ఎకరాల పంటకు అతను 2019లో రూ. 70,వేలు, లక్షరూపాయలు, ఇప్పుడు 2022లో ఎకరాకు రూ.1.40 లక్షలు సంపాదిస్తున్నాడు. మొత్తం మీద రెండు ఎకరాల నేరేడు పంట ద్వారా రూ. 3 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకూ వాణిజ్య పంటల ద్వారా ఇంతగా సంపాదించలేదని అక్కడ రైతులు అంటున్నారు.

ఎరువులు, పురుగు మందుల నిర్వహణలో మెరుగైన మెళకువలు నేర్చుకుని నేరేడు తోటలను లాభసాటిగా మార్చుకోవచ్చని చెబుతున్నారు.కేవలం100 చెట్లు ద్వారా దాదాపు 3 లక్షలు మేర ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నేరేడు తోట పుష్పించే దశకు వచ్చింది. పుష్పించే దశ నుంచి ఫలాలు వచ్చే దశ వరకు, ఉత్తమ నిర్వహణ పద్ధతులు అనుసరించడం ద్వారా మరింత దిగుబడి పొందగలుగుతారని అంటున్నారు..ఎన్నో రొగాలను నయం చేస్తుంది.. దాని వల్ల సీజన్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే వుంది.ప్రస్తుతం మార్కెట్ లో నేరేడు పండ్లు కిలో రూ.200 నుంచి రూ.150 పలుకుతున్నాయి. నేరేడు పంట ద్వారా ఎక్కువ ఆదాయం రావడంతో చాలా మంది రైతులు నేరేడును సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆయా రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు.. ఈ పంట పై ఎటువంటి సందెహాలు ఉన్న దగ్గర లోని వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news