మీడియా రంగంలోకి అదానీ ఎంట్రీ..

-

దేశంలో నంబర్ వన్ బిజినెస్​మ్యాన్​ గౌతమ్‌ అదానీ త్వరలోనే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఎన్​డీటీవీలో వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎన్​ఎమ్​ఎల్,​ ఎన్​డీటీవీలో రూ.493కోట్లతో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. అదానీ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రధాన్ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఇప్పటికే ఎన్​డీటీవీ ప్రమోటర్ సంస్థ అయిన ఆర్​ఆర్​పీఆర్​​ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 29.18 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు కసరత్తు చేసింది.


అదానీ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏఎమ్​జీ మీడియా నెట్‌వర్క్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్ సంయుక్తంగా ఎన్​డీటీవీకి చెందిన కోటీ 67 లక్షల 62వేల 530 షేర్లను ఒక్కోటి రూ.294 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రతిపాదించాయి. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లలో ఎన్​డీటీవీ షేర్‌ విలువ రూ.366.20గా ఉంది. ఈ ప్రతిపాదనలు విజయవంతమైతే ఎన్​డీటీవీలో 55 శాతం వాటాలతో మెజార్టీ వాటాదారుగా ఆదానీ గ్రూప్‌ నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news