ట్రిపుల్ ఆర్ ఇంటర్వల్ షూట్.. రాజమౌళి 25 రోజుల ప్లాన్..!

-

రాజమౌళి తెరకెక్కిస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ పై సెన్సేషనల్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాకు సంబందించిన మొదటి షెడ్యూల్ నవంబర్ 5న మొదలు పెడుతున్నారట. ప్రస్తుతం అల్యుమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగనుందట. అంతేకాదు మొదలు పెట్టడమే ఇంటర్వల్ సీన్ చేస్తారని తెలుస్తుంది.

రాజమౌళి సినిమాల్లో ఇంటర్వల్ సీన్ స్పెషల్ గా ఉంటుంది. ఇక ఈ మల్టీస్టారర్ సినిమాకు అదిరిపోయే ఇంటర్వల్ సీన్ రాసుకున్నారట. ఈ సీన్ లో చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు పాల్గొంటారని తెలుస్తుంది. యూనిట్ కు మల్టీస్టారర్ పై జోష్ వచ్చేలా ముందే చరణ్, ఎన్.టి.ఆర్ ఉండే సీన్స్ షూట్ ప్లాన్ చేశాడట రాజమౌళి.

ఈ ఇంటర్వల్ షూట్ 25 రోజులు ఉంటుందట. నవంబర్ 5 నుండి 30 వరకు కంటిన్యూస్ గా ఈ షెడ్యూల్ నడుస్తుందట. 2020 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేసేలా షెడ్యూల్ సెట్ చేశారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బాహుబలిని మించి వెళ్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version