రాజ్ తరుణ్​కు కొత్త ట్యాగ్​… ఇక నుంచి అలానే పిలవాలట

-

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు. రామ్‌ భీమన తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడీగా హాసిని సుధీర్‌ కథానాయికగా నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ (జులై 26వ తేదీ) ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌కు ఇమేజ్​ ట్యాగ్ వచ్చింది. ఇండస్ట్రీలో ఇమేజ్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే స్టార్ హీరోల ఇమేజ్ ట్యాగ్ లకు ఎంత పవర్ ఉంటుందో తెలిసిందే.

అయితే రాజ్ తరుణ్ వంటి యం గ్ హీరోకు కూడా కొత్తగా ఇమేజ్ ట్యాగ్ వచ్చి చేరింది. ఇవాళ రిలీజ్ అయిన పురుషోత్తముడు సినిమా టైటిల్స్ పడే సమయంలో జోవియల్ స్టార్ రాజ్‌ తరుణ్‌ అని టైటిల్ వేశారు. ఈ సినిమా కంటే ముందు వరకు రాజ్‌ తరుణ్‌కు ఏ ట్యాగ్ లేదన్న సంగతి తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్​తో పరిచయమైన రాజ్​ తరుణ్​ ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత  సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ఇంకో హిట్ పడలేదు. దీంతో  పురుషోత్తముడు సినిమా అయినా హిట్ అవుతుందా జోవియల్ స్టార్ టైటిల్ రాజ్ తరుణ్ కు కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news