రాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనే తండ్రైన టాలీవుడ్ హీరో

-

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సమయంలో టాలీవుడ్ హీరో తండ్రి అయ్యారు. యంగ్ హీరో సుహాస్, లలిత దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. దీనిపై డైరెక్టర్ సందీప్ స్పందిస్తూ…. ‘విజయవాడలోని అయోధ్యనగర్ కు చెందిన సుహాస్ రాముడి ప్రాణ ప్రతిష్ట రోజే తండ్రి అవడంతో ఈ శుభదినం మరింత ప్రత్యేకమైనది.

Actor Suhas Wife Lalitha Deliver Baby Boy

మీ జంటకు అభినందనలు’ అని వారి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా, అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరాముడిపై తమ భక్తుని చాటుకున్నారు. సమీప ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అయితే నటి మంచు లక్ష్మీ తన రామభక్తిని ప్రత్యేకంగా చాటుకున్నారు. అయోధ్య నుంచి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను లాప్టాప్ లో లైవ్ చూస్తూ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేయగా… నెటిజన్లు భిన్నంగా స్పంది స్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news