అయోధ్య సన్నిధిలో టీమ్ఇండియా జెర్సీలో విరాట్.. వీడియో వైరల్

-

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశవ్యాప్తంగా వేలమంది హాజరైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆహ్వానం అందుకున్న అతిథులంతా అయోధ్య వేడుకను కనులారా వీక్షించారు. చిరంజీవి, రజనీకాంత్ రామ్ చరణ్, పవన్ కల్యాణ్, ఆలియా, రణ్బీర్ కపూర్ లాంటి సినీ స్టార్స్తో పాటు సచిన్, రవీంద్ర జడేజా, అనిల్కుంబ్లే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కు మాత్రం నిరాశే మిగిలింది. ఈ వేడుకకు విరుష్క జంట హాజరవ్వలేదు.

అయితే తాజాగా విరాట్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయోధ్య వీధుల్లో టీమ్ ఇండియా జెర్సీ ధరించి విరాట్ తిరుగుతున్నట్లు ఈ వీడియోలో కనిపించడంతో అయోధ్యకు విరాట్ వచ్చాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన కోహ్లీ ఫ్యాన్స్ ఈ విషయం తెలియగానే విరాట్ను చూసేందుకు అక్కడికి వెళ్లారు. తీరా చూస్తే అక్కడుంది విరాట్ కాదట. విరాట్ పోలికలతో కనిపించే ఓ వ్యక్తి. అతణ్ని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత అతడితో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news