డ్రగ్స్ కేసులో ఆరోపణల పై స్పందించిన నటి జ్యోతి

-

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ కేసులో కబాలి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కృష్ణ ప్రసాద్ చౌదరిపై నిఘా పెట్టిన మాదాపూర్ ఎస్ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్ పురలో ఆయనని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన రాత్రి అతడిని అరెస్టు చేసి ఉప్పరపల్లి కోర్టు అనుమతితో రాజేంద్రనగర్ పోలీసులు ఆయనని కస్టడీలోకి తీసుకొని విచారించారు.

అతడి మొబైల్ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ ను ఢీకోడ్ చేసి వాటి ఆధారంగా వివరాలు సేకరించారు. చౌదరి కాల్ లిస్ట్, వాట్సప్ లో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి, నటి సురేఖ వాణి, జ్యోతి ఫోన్ నెంబర్లను గుర్తించారు. అయితే డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా స్పందించింది నటి జ్యోతి. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం లేదని స్పష్టం చేసింది. కె.పి చౌదరి తనకు స్నేహితుడు మాత్రమేనని.. డ్రగ్స్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇందులో ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని.. తన ఫోన్ డేటా రిట్రీవ్ చేసుకున్నా అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది జ్యోతి. ఇటువంటి అసత్య ప్రచారాలు చేయవద్దని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news