నా బిడ్డ బాధ మిమ్మల్ని వెంటాడుతుంది : రేణు దేశాయ్‌ ఎమోషనల్ పోస్టు

-

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఇటీవల తన సతీమణి అనా లెజినొవా, పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోను ఉపయోగించి సినీ నటి రేణు దేశాయ్‌ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్‌ రూపొందించడంతో ఆమె వారిపై తీవ్రంగా మండిపడ్డారు.

‘‘ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్‌, జోక్‌లు పేల్చే భయంకరమైన వ్యక్తులూ.. మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాను. అయితే నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకొని పోస్టు చేశాను’’ అని రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news