నడిరోడ్డుపై అతడి చెంప పగలగొట్టిన సంయుక్త… ఎందుకంటే?

-

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ సంయుక్త మీనన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాల్లో నటించి హిట్స్ ను అందుకుంది. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాలో నటించి మరో హిట్ ఖాతాలో వేసుకుంది.

సంయుక్త మీనన్ టాలీవుడ్ హీరోయిన్ సమంతకు తాను వీరాభిమానని అని తెలిపింది. అలాగే  సామ్ నటనంటే తనకు చాలా ఇష్టమని, తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటున్నారని పేర్కొంది. సమంతలా నటిస్తున్నానని చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సంయుక్తకు కోపం ఎక్కువేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

హీరో ధనుష్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ నటించిన ఆడుగళం సినిమాలోని పాటలను బస్సులో చూసి డాన్స్ చేసేదాన్ని అని తెలిపింది. అలాంటిది ఆయన సరసన నటిస్తానని అసలు ఊహించలేదని చెప్పింది. తనకు నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కుటుంబకథా చిత్రాల్లో నటించాలని ఉందని మనసులో మాటను తెలిపింది. అలాగే తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తుచేసుకుంది. ఒక వ్యక్తిని తాను నడిరోడ్డుపై కొట్టిన సంఘటన గురించి చెప్పింది. ఒకసారి తన తల్లితో కలిసి బయటకు వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ పొగను తమపై వడిలాడని.. దీంతో కోపంతో అతని చెంప పగలగొట్టినట్లు తెలిపింది.

ప్రయాణం చేయడం, ఒంటరిగా ఉండటం చాలా ఇష్టమని.. ఎక్కువగా హిమాలయాలకు వెళ్తుంటానని.. ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటానని అంటూ తన హాబీస్ గురించి చెప్పింది తన చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరు నుంచి తీసేసానని తెలిపింది. ప్రస్తుతం సంయుక్త..నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న డెవిల్ చిత్రంలో నటిస్తుంది. బింబిసార తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్ కు జోడీగా నటిస్తోంది. ఇంకా డైరెక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో సంయుక్తను ఎంపిక చేసినట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version