తాళ్లరేవు రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

-

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాళ్ళరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద మహిళా ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళా కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను రొయ్యల కంపెనీలో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. వారు తాళ్ళరేవు నుంచి యానం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన వారిని కాకినాడ జిజిహెచ్ కి తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టజీవులైన కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరుతున్నాం అన్నారు పవన్ కళ్యాణ్. రహదారి భద్రతా చర్యలపై రవాణా, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version