సిల్క్ స్మిత చివరి లేఖ ఇదే.. ఆ ఇద్దరూ అంత మోసం చేశారా!

-

మత్తు కళ్ళ సుందరిగా టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్న అందాల భామ సిల్క్ స్మిత. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న సిల్క్ స్మిత అకాల మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె మృతిపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ ఆత్మహత్యగా తేల్చేశారు. తాజాగా చివరగా సిల్క్ స్మిత రాసిన ఒక లెటర్ బయటకు వచ్చింది. ఇందులో ఆమె తన ఆవేదనను వెళ్ళగక్కారు.

సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న తన నివాసంలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. ఆ సమయంలో ఆమె నివాసంలో తనిఖీలు చేసిన పోలీసులకు ఒక ఉత్తరం లభించగా ఇందులో సిల్క్ స్మిత తన బాధను చెప్పుకొచ్చారు. నా ఏడవ ఏట నుండే పొట్టకూటి కోసం కష్టపడుతున్నాను. నాకంటూ ఎవరూ లేరు. ప్రేమించేవారు లేరు. బాబు ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు. ఆదరించాడు. మిగతా వాళ్ళందరూ నా సొమ్ము తిని.. నమ్మించి మోసం చేశారు. రాము, రాధాకృష్ణ నాకు చాలా అన్యాయం చేశారు. దేవుడనే వాడు ఉంటే వాళ్ళను చూసుకుంటారు. ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నాకు దూరమయ్యాడు. ప్రతి ఒక్కడూ నా రెక్కలు కష్టం తిన్నవాడే. బాబు తప్ప అందరూ నా సొమ్ము తిన్నారు. రోజూ టార్చర్ అనుభవించాను. ఈ బాధ భరించలేకపోతున్నాను.. అంటూ సిల్క్ స్మిత రాసుకొచ్చారు.

article_image1

ఈ లేఖలో స్మిత రాము, రాధాకృష్ణ అనే వ్యక్తుల గురించి ప్రస్తావించారు. వారిద్దరే తనకు అన్యాయం చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ లేఖలో ఎక్కడ ఆమె చనిపోతున్నట్టు రాయలేదని తెలుస్తోంది. రాధాకృష్ణ అనే వ్యక్తి స్మితకు పర్సనల్ సెక్రెటరీ ఆమె మరణానంతరం అతని విచారించిన పోలీసులు నిర్దోషిగానే తేల్చారు కానీ అసలు నిజాలు బయటకు తెలియలేదు.

దాదాపు 10 ఏళ్ల పాటు వందల చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి ఆడి పాడింది. చిరంజీవి, రజినీకాంత్, మోహన్లాల్, బాలకృష్ణ వంటి ఎందరో స్టార్ హీరోలతో నటించిన సిల్క్ స్మిత మరణం సమయంలో మాత్రం ఆమెను చూడటానికి ఎవరూ రాలేదు. చనిపోయిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరగగా అక్కడే ఉన్న సిబ్బంది ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news