నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్‌ విభాగం సమన్లు

-

ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్‌ పోలీసు విభాగం నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో సమన్లు ఇచ్చినట్లు తెలిపింది. ఈ కేసులో ఆమెను ప్రశ్నించాల్సి ఉన్నందున ఈ నెల 29వ తేదీన సైబర్‌ విభాగం ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడంతో ‘వయాకామ్‌’ మీడియాకు రూ.కోట్ల మేర నష్టం జరిగిందని సైబర్‌ విభాగం పేర్కొంది. ఇదే కేసులో ఇటీవల మరో నటుడు సంజయ్‌ దత్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్‌ 23వ తేదీనే ఆయణ్ను విచారణకు రావాలని ఆదేశించగా గైర్హాజరయ్యారు. ఆ సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని కోరారు.

‘ఫెయిర్‌ప్లే’ యాప్‌ అనేది మహదేవ్‌ ఆన్‌లైన్ గేమింగ్‌ అండ్‌ బెట్టింగ్‌ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఎలాంటి అధికారిక బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులు లేకపోయినా గతేడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయగా.. వాటిని చూడాలంటూ పలువురు బాలీవుడ్‌ నటులు, గాయకులు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది.

Read more RELATED
Recommended to you

Latest news