కరీంనగర్ లో నామినేషన్ వేసిన బండి సంజయ్

-

లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. నామపత్రాల స్వీకరణకు ఇవాళే చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఒక్కొక్కరుగా కలెక్టర్ కార్యాలయకు పోటెత్తుతున్నారు. భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్లు రానున్నట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగిస్తున్న బీజేపీ అభ్యర్థులు ఇవాళ భారీ సంఖ్య నామపత్రాలు దాఖలు చేసేందుకు బయల్దేరారు.

ఇందులో భాగంగా ఈరోజు కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధఅయక్షుడు కిషన్‌ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ వద్ద ర్యాలీలో నేతలు పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ, రాజీవ్‌చౌక్ మీదుగా టవర్ సర్కిల్ వరకు నేతలు ర్యాలీ నిర్వహించారు. టవర్ సర్కిల్ వద్ద భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Latest news