Akshay Kumar: బహిరంగ క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ స్టార్ హీరో..భవిష్యత్తులో అలా చేయబోనని హామీ

-

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ పై గత కొద్ది రోజులుగా ట్రోలింగ్ జరుగుతోంది. తాను జనాలకు హాని కలిగించే వస్తువులను ప్రమోట్ చేయబోనని గతంలో పేర్కొన్న అక్షయ్ కుమార్..ఎందుకు విమల్ ఇలాచి ప్రమోషన్ చేశాడని నెటిజన్లు, అభిమానులు ప్రశ్నించారు. ఈ విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. కాగా, తాజాగా తనపై వస్తున్న ట్రోలింగ్ పైన ఖిలాడీ అక్షయ్ స్పందించారు.

ట్వి్ట్టర్ వేదికగా ట్వీట్ లో బహిరంగ క్షమాపణ చెప్పారు అక్షయ్ కుమార్. ప్రముఖ బ్రాండ్ విమల్ ఇలాచికి బ్రాండ్ అంబాసిండర్ గా తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ యాడ్ లో నటించినందకు వచ్చిన డబ్బును విరాళంగా గొప్ప పనికి ఇస్తానని చెప్పాడు. దాంతో అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘దటీజ్ అక్షయ్’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ రీ ట్వీట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘‘విమల్ ఇలాచాతో నా అనుబంధం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మీ భావాల వెల్లువను నేను గౌరవిస్తున్నారను. నేను ఈ విషయమై వెనక్కి తగ్గాను. యాడ్ లో నటించినందుకు వచ్చిన డబ్బును విలువైన పనికోసం వినియోగిస్తాను. అయితే, నాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. కొంత కాలం పాటు బ్రాండ్ ప్రకటనల్లో నేను కనబడుతాను. వారు అలా ప్రసారం చేసుకుంటారు. అయితే, భవిష్యత్తులో ఇటువంటివి ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ప్రతిఫలంగా మీ ప్రేమను, కోరికలను ఎప్పటికీ అడుగుతాను..నన్ను క్షమించండి మీ అక్షయ్ కుమార్’’ అని ట్వీట్ చేశాడు అక్షయ్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Latest news