‘అల వైకుంఠపురం లో’ ఫంక్షన్ :  ఒక్క పాటకి 400 మంది డాన్సర్లతో హోరెత్తిన యూసఫ్ గూడా గ్రౌండ్..!!

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠ పురం లో’ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా అభిమానుల మధ్య జరుగుతోంది. అభిమానులకు మరియు వీఐపీలకు ప్రత్యేకమైన దారులు కేటాయించారు. వచ్చే అతిథుల కోసం ఆహ్వానం ప్రవేశద్వారం దగ్గర సంగీత వాయిద్యాలు ఉండేలా వెల్కమ్ చెప్పేలా డెకరేషన్ చేశారు.

చాలా అద్భుతంగా  ‘అల వైకుంఠ పురం లో’ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ జరుగుతోంది. ఫంక్షన్ కి లేడీస్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇదిలా ఉండగా సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా 400 మంది డ్యాన్సర్లతో అల్లు అర్జున్ ‘అల వైకుంఠ పురం లో’ సినిమాలో డ్యాన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ‘అల వైకుంఠ పురం లో’ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్ లో వేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఒక్కసారిగా సాంగులో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు చూసి గ్రౌండ్ దద్దరిల్లి పోయేలా హోరెత్తించారు.

 

ఇరగదీసే డాన్స్ తో స్టెప్పులతో 400 మంది డ్యాన్సర్లతో వేసిన ఈ సాంగ్ ఓ మై గాడ్ డాడీ సాంగ్ …సాంగ్ కి గ్రౌండ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా సినిమా ధియేటర్ లో మాత్రం అల్లు అర్జున్ ఈ పాటలో వేసిన స్టెప్పులకు అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ అని గ్రౌండ్ లో వచ్చిన రెస్పాన్స్ బట్టి తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news