త్రివిక్రమ్ ఒక మోసగాడు – నా కథ దొంగలించి ‘అల’ తీశాడు – ఎన్‌టి‌ఆర్ రైటర్ ప్రూఫ్స్ తో సహా కోర్టు కి ??

-

టాలీవుడ్ మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురము లో’ సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. నాన్ బాహుబలి రికార్డులను కూడా అధిగమించింది. ఇటువంటి నేపథ్యంలో ‘అలా వైకుంఠపురము లో’ సినిమా తన ది అంటూ ఒకతను మీడియా ముందుకు వచ్చి డైరెక్టర్ త్రివిక్రమ్ పై విమర్శలు చేశాడు అంటూ కొన్ని ప్రముఖ వెబ్ సైట్ లు రాస్తున్నాయి.

Image result for trivikram ala vaikunta puram lo

త్రివిక్రమ్ ఒక మోసగాడు అంటూ గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘సుబ్బు’ సినిమా స్టోరీ రాసిన కృష్ణ అనే రైటర్ ప్రూఫ్స్ తో సహా షాకింగ్ కామెంట్లు చేశారు. కృష్ణ అనే రైటర్ మాట్లాడుతూ…2005వ సంవత్సరంలో ‘అలా వైకుంఠపురము లో’ సినిమా స్టోరీని త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చెప్పటం జరిగిందని స్క్రిప్టు 2013వ సంవత్సరంలో రిజిస్టర్ అయిందని చెప్పుకొచ్చాడు.

 

అయితే ఇదే స్క్రిప్ట్ విషయమై సినిమా చేయాలని ప్రారంభించిన సందర్భంలో సేమ్ ఇదే స్టోరీతో సినిమా వస్తున్నట్లు నేను చేయబోయే సినిమా నిర్మాతకు తెలియడంతో నా ప్రాజెక్టు పక్కకు పెట్టేశారు తీర తీస్తున్నది ఎవరని చూస్తే అన్ని విషయాలు బయటకు వచ్చాయి అని త్రివిక్రమ్ నా సినిమా స్టోరీ కాపీ కొట్టాడు అని ఆరోపిస్తున్న రైటర్ మాట్లాడినట్లు సదరు వెబ్ సైట్ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అంతే కాకుండా సదరు రైటర్ ప్రూఫ్స్ తో సహా కోర్టు కి వెళ్తానని బెదిరిస్తున్నాడు అని కూడా సమాచారం. మరి త్రివిక్రమ్ ఈ మ్యాటర్ ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి. 

Read more RELATED
Recommended to you

Latest news