మహేష్ తో క్రిష్.. అరవింద్ మెగా స్కెచ్

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో మైత్రి మూవీస్ బ్యానర్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ కూడా మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు నిన్న మొన్నటిదాకా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ డైరక్టర్ అని వార్తలు రాగా మళ్లీ ఈ కాంబినేషన్ డైరెక్ట్ చేసేది క్రిష్ అని అంటున్నారు.

ప్రస్తుతం క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఖాళీ అవుతాడు. అయితే అరవింద్ క్రిష్ డైరక్షన్ లో మహేష్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. గమ్యం నుండి రాబోతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ వరకు క్రిష్ సినిమా అంటే బాగానే అంచనాలు ఏర్పడుతున్నా కమర్షియల్ గా మాత్రం అంతగా వర్క్ అవుట్ కాలేదు. మరి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ సినిమా క్రిష్ డైరక్షన్ లోనే ఉంటుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news