శ్రీకాంత్ సినిమా రీమేక్‌లో ఆనంద్ దేవరకొండ..

-

టాలీవుడ్‌ యంగ్ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో ఆనంద్‌ దేవరకొండ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆనంద్‌ దేవరకొండ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో శివాత్మిక రాజశేఖర్ వెండితెరకి పరిచయం అయింది. సినిమా కమర్షల్ గా ఫ్లాప్ అయినప్పటికీ నటినటులుగా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆనంద్ మరో సినిమాని చేస్తున్నాడు.

అదే కాకుండా మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. అది కూడా ఓ పాత సినిమాకి రీమేక్ అని సమాచారం. 1997 శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన `తాళి` సినిమాని రీమేక్ చేసే పనిలో ఉన్నాడట ఆనంద్. ఈ జనరేషన్ తగ్గట్టుగా కథలో మార్పులు చేసి సినిమాని తీయాలని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version