వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ లో జర్నలిస్టుగా అనసూయ..!

-

Anasuya acting in ysr biopic yatra as journalist

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా వస్తున్నది తెలుసు కదా. ఇది బయోపిక్స్ సీజన్. ఇప్పటికే సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. క్రికెటర్ల బయోపిక్స్ కూడా తెరపై వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై కూడా ఓ సినిమా రాబోతుంది.

ఇక.. యాత్ర సినిమాను రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. అయితే.. యాత్ర సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా నటిస్తున్నదట. జర్నలిస్టుగా నటిస్తున్నదట అనసూయ.

ఆ మూవీ షూటింగ్ అప్పుడు తీసిన ఓ ఫోటోను అనసూయే తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు తీసిన ఫోటో అది. ఇక.. ఆ ఫోటోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమాపై బాగా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక.. ఈ సినిమాను వైఎస్ జగన్ బర్త్ డే రోజున డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news