Anasuya: స్టార్ యాంకర్ ఫుల్ బిజీ..సరికొత్త కాన్సెప్ట్‌తో ఫిల్మ్ కంప్లీట్ చేసిన అనసూయ

-

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొ్చ్చు. ఓ వైపున స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే మరో వైపున ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తోంది. ఇటీవల ఈమె నటించిన ‘దర్జా’ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో డాన్ గా కనిపించిన అనసూయ..మరో సరికొత్త అవతార్ లో కనిపించబోతున్నది.

‘పేపర్ బాయ్’ ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇందులో సాయి కుమార్‌ కీలక పాత్రలో నటించారు. ఈ పిక్చర్ డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి మూవీని ప్రొడ్యూస్ చేయగా, అనూప్ రూబెన్స్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంత వరకు ఎవరూ టచ్ చేయని సరికొత్త అంశాన్ని ఈ చిత్రంలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు దర్శకుడు జయశంకర్. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని, కామెడీ వేలోనే సరికొత్త అంశాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చెప్తామన్నారు.

ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఈ పిక్చర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని పేర్కొన్న జయశంకర్..పిక్చర్ కు టైటిల్ ‘అరి’ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. ఈ నెల 29న ఆ సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news