ఆ మాట అనడంతో.. దొబ్బెయ్ అంటూ అనసూయ ఫైర్

-

బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్న యంకర్, నటి అనసూయ. జబర్దస్త్ యాంకర్‌గా వెలుగులోకి వచ్చిన అనసూయ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుని ఎప్పటికీ నిలిచిపోయే పాత్రలను చేస్తోంది. అటు బుల్లితెరపై కొత్త కొత్త షోలను హోస్ట్  చేస్తూనే మరోవైపు మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉంటోంది. ఇలా రెండు చేతులా బాగానే సంపాదించుకుంటోన్న అనసూయ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుంది.

అనసూయ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ప్రతీదాంట్లో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె నిత్యం షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తూనే ఉంటాయి. తాాజాగా ఆమెను అసభ్యకరంగా కామెంట్ చేశారని, ట్విట్టర్ సంస్థకు,సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

తాజాాగా లైవ్‌లోకి వచ్చిన అనసూయను ఆంటీ అని పిలిచాడో నెటిజన్. నీకు పుట్టే పిల్లలకు ఆంటీని అవుతాను నీకు కాదు పక్కకెళ్లి ఆడుకో అంటూ సెటైర్ వేసింది. అసలు బయటి వారిని ఆంటీ, అంకుల్ అని పిలవకూడదని, మేడమ్ సార్ అంటూ పిలవాలంటూ క్లాస్ పీకింది. దీంతో చిర్రెత్తిన మరో నెటిజన్ ఈ సోది చెప్పడానికా లైవ్‌లోకి వచ్చిందంటూ కామెంట్ చేశాడు. ఇది తన అకౌంట్ తనకు ఇష్టమొచ్చింది చెబుతాను వింటె విను లేకుంటే దొబ్బెయ్ అంటూ ఘాటుగా విమర్శించింది అనసూయ.

Read more RELATED
Recommended to you

Latest news