అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

-

అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఇవాళ ఏఎన్నార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఏఎన్నార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులు, అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, రామ్‌చరణ్‌. మహేష్‌బాబు, రానా, విష్ణు, నాని, దిల్‌ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఏఎన్నార్‌ గురించి మాట్లాడుతూ.. ఆయన విగ్రహావిష్కరణ చూడటమే మహాభాగ్యమని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి ఏఎన్నార్‌ చేరుకున్నారని అన్నారు. ఇంతటి అద్భుతమైన స్థితికి చేరుకోవడం సామాన్య విషయం కాదని.. నటన అనే చిన్న అర్హతతో ఏఎన్నార్‌ మహోన్నత వ్యక్తిగా మారారని చెప్పారు.

‘అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు. అక్కినేని నాగేశ్వరరావు సర్వసాధారణంగా ఉంటారు. ఏఎన్నార్‌ క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఏఎన్నార్‌కు వచ్చినన్ని అవార్డులు ఇంకెవరికీ రాలేదు. ఏఎన్నార్‌ పొందిన సన్మానాలు ఇంకెవరికీ జరగలేదు.’ అని బ్రహ్మానందం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news