స్టార్ డైరెక్టర్ ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన అనుష్క..కానీ..?

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క అందం , అభినయంలో విశేష గుర్తింపు సొంతం చేసుకొని మరింత పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మంగళూరు కి చెందిన ఈమె యోగా టీచర్ గా తన కెరియర్ను మొదలుపెట్టి.. 2005లో సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే అందాలను ఆరబోసిన ఈమె ఆ తర్వాత కూడా చాలా సినిమాలలో గ్లామర్ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె అరుంధతి చిత్రం సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ నే మార్చేసుకుంది. అందులో జేజమ్మగా ప్రేక్షకులను మెప్పించి మరింతగా ఆకట్టుకుంది.

అంతే కాదు బాహుబలి, భాగమతి వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచిన అనుష్క సైజ్ జీరో చిత్రంతో ఒక్కసారిగా తన నట జీవితాన్ని తలకిందులు చేసిందని చెప్పాలి. అనుష్క ఆ పాత్ర కోసం తన బరువును భారీగా పెంచేసుకుంది. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లభించడం లేదు. దీంతో కొన్ని సినిమాలు ఆమె చేయలేక పోయింది. మళ్లీ నిశ్శబ్దం అనే సినిమాతో వచ్చినా సరే అది డిజాస్టర్ గానే మిగిలింది. ఇప్పుడు తాజాగా అనుష్క , నవీన్ పోలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి “ఆగస్టు 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఈ క్రమంలోనే అనుష్కకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటారని డైరెక్టుగా అనుష్కను అడిగారట. అయితే అనుష్క మాత్రం రాఘవేంద్రరావు ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. గతంలో తన కుమారుడు ప్రకాష్ కి పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రాఘవేంద్రరావు ఫస్ట్ ఛాయిస్ అనుష్కని అనుకున్నారని.. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఆమె తిరస్కరించిందని సమాచారం. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అనుష్క ఒంటరిగానే మిగిలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news