‘కల్కి’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్

-

మరో రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సైన్స్ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ థియేటర్లలోకి రాబోతోంది. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఇక తాజాగా కల్కి సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27వ తేదీ నుంచి రెండు వారాల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్‌ చేసిన వినతికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంటూ .. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version