కమల్​ ఫ్యాన్స్​ కు గుడ్ న్యూస్.. రేపే ఓటీటీలోకి ‘భారతీయుడు’

-

విశ్వ నటుడు  క‌మ‌ల్ ​హాస‌న్- శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు- 2’ థియేటర్లలో సందడి చేస్తోంది. మిక్స్ డ్ టాక్ తో ఈ సినిమా రన్ అవుతోంది. జులై 12న రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది.  ‘భారతీయుడు’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఓటీటీలో ఎంట్రీ ఎంటీ అని షాక్ అవుతున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే!

ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది.. తాజాగా రిలీజ్ అయిన భారతీయుడు-2 కాదు.. 1996లో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టిన ‘భారతీయుడు’ (ఫస్ట్ పార్ట్). తాజాగా విడుదలైన భారతీయుడు- 2 తొలి పార్ట్​కు సీక్వెల్​గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా సీక్వెల్ ను చూసే ముందు పార్ట్-1 చూడాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంటుందని మేకర్స్ భారతీయుడు పార్ట్-1 విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో జులై 15వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కమల్​ హాసన్​తోపాటు మనీషా కొయిరాలా, ఉర్మిళ, భానుప్రియ నటించిన తొలిపార్ట్​ అప్పట్లో భారీ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news