రేపే భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మృతి చెంద‌డంతో నిన్న నిర్వ‌హించాల‌నుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లానాయ‌క్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ప‌డింది. మ‌ర‌ల ఎప్పుడూ నిర్వ‌హిస్తారంటూ అభిమానుల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. అస‌లు ఈవెంట్ ఉంటుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో క‌లుగుతూ ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 23న హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కానీ విష‌యంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌, త‌ల‌సాని హాజ‌రుకానున్నారు.

ఇప్ప‌టికే భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్ విడుద‌లై యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. టాలీవుడ్ అతివేగంగా 7 మిలియ‌న్ వ్యూస్ సాధించిన ట్రైల‌ర్గా భీమ్లానాయ‌క్ రికార్డు సృష్టించింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న నిత్యామీన‌న్‌, రానా స‌ర‌స‌న సంయుక్త మీనన్ న‌టించారు. థ‌మ‌న్ సంగీతం స‌మకూర్చారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 25న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల‌వ్వ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news