రణబీర్, సాయి పల్లవి ‘రామాయణం’ పై బిగ్ ట్విస్ట్..!

-

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్  హీరోగా నటించిన రీసెంట్ భారీ హిట్ చిత్రం ‘అనిమల్’ కోసం అందరికీ తెలిసిందే. మరి అనిమల్ చిత్రం తర్వాత రణబీర్ మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టుకోగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి కాంబినేషన్ లో చేయనున్న భారీ చిత్రం ‘రామాయణం’ కూడా ఒకటి.

మరి ఈ సినిమాలో టాలెంటెడ్, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్ర చేయనుంది అని ఇది వరకే టాక్ ఉంది. అయితే ఈ చిత్రం కోసం మూవీ లవర్స్ లో చాలా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా బాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ట్విస్ట్ బయటకి వచ్చింది. ఈ సినిమా ఇంకా అధికారికంగా కూడా అనౌన్స్ కాలేదు కానీ క్యాస్టింగ్ పరంగా సాలిడ్ బజ్ ఉంది.

వీటితో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వేచి చూస్తున్న వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అయితే ఈ చిత్రం స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతుందట. అంతర్గతంగా ఉన్న కొన్ని కారణాలు రీత్యా ఈ చిత్రం ఈ ఏడాదిలో కూడా స్టార్ట్ కాకపోవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ అవైటెడ్ సినిమా మరింత ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news